కరోనా దండయాత్రతో వ్యవస్థలన్నీ స్తబ్దుగా ఉండిపోయాయి. ఇప్పుడిప్పుడే అన్నీ గాడిలో పడుతున్నాయి. వీటిలో సినీ పరిశ్రమ కూడా ఉంది. కొన్ని నెలల క్రితమే షూటింగ్స్ కు పర్మిషన్లు వచ్చాయి. ఆ తర్వాత ధియేటర్స్ 50 శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ చేసేందుకు పర్మిషన్లు వచ్చాయి. కానీ.. ఎక్కడా ఎవరూ దాదాపు ధైర్యం చేయలేదు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం.. వంటి నగరాల్లో మల్టీప్లెక్స్ ల్లో సినిమాలు పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటివలే పర్మిషన్ ఇచ్చింది. అయినా.. పెద్దగా స్పందన రాలేదు. కానీ.. ఇప్పుడు మహేశ్ బాబు భాగస్వామిగా ఉన్న AMB సినిమాస్ లో సినిమా షోలు పడబోతున్నాయి.
ఇందుకు సంబంధించి AMB Cinemas నుంచి అఫిషియల్ న్యూస్ రివీల్ అయింది. డిసెంబర్ 4 (శుక్రవారం) నుంచి సినిమాలు ప్రదర్శిస్తున్నామని ప్రకటించింది. ప్రభుత్వం సూచించిన గైడ్ లైన్స్ ప్రకారం 50శాతం సీటింగ్ తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు ప్రదర్శిస్తామని చెప్పింది. బుకింగ్స్ చేసుకోండి.. 5 స్టార్ ఎక్స్ పీరియన్స్ ఎంజాయ్ చేయాలంటూ సోషల్ మీడియాలో తెలిపింది. దీనిపై దగ్గుబాటి రానా, విశ్వక్ సేన్.. స్పందించారు. ’AMBలో.. ‘టినెట్’ సినిమా చూడాలని ఉంది..’ అంటూ ట్వీట్ చేశాడు. ‘వి ఆర్ బ్యాక్’ అంటూ విశ్వక్ సేన్ స్పందించాడు. దీంతో మూవీ లవర్స్ లో ఉత్సాహం నెలకొంది. టినెట్, అల.. వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, అర్జున్ రెడ్డి, కనులు కనులు దోచాయంటే, వార్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే.. సినిమాలను ప్రదర్శించనున్నారు.
ఏషియన్ సినిమాస్ తో భాగస్వామిగా ఉన్న మహేశ్ బాబు AMB Cinemas ను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మల్టీప్లెక్స్ తెరుచుకోవడంతో మరిన్ని మాల్స్ లో సినిమాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే సింగిల్ స్క్రీన్ ధియేటర్స్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ తన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ధియేటర్లు ఓపెన్ అయితే.. మెల్లగా సినిమాలు విడుదల కావడం.. ప్రేక్షకులు రావడం కూడా జరుగుతుందని చెప్పాలి.