Anasuya : మెగా నిర్మాణ బ్యానర్ లో అనసూయ..??
Anasuya : బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న యాంకర్ అనసూయ మరోపక్క సినిమా ఇండస్ట్రీలో కూడా వరుస ఆఫర్లు దక్కించుకుని బిజీ ఆర్టిస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో మాత్రమే కాక సౌత్లో ఇతర ఇండస్ట్రీలో కూడా అనసూయ సినిమాలు చేస్తూ ఉంది. హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న.. అనసూయ ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే మెగా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కి చెందిన బన్నీ వాసు నిర్మిస్తున్న ఓ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
మేటర్ లోకి వెళితే కార్తికేయ, లావణ్యత్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు చావు కబురు చల్లగా సినిమాలో ఐటెం సాంగ్ కోసం అనసూయని సినిమా యూనిట్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాప్ వినబడుతుంది. కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. ఎప్పటినుండో సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతూ ఉండగా చివరి దశకు చేరటంతో సాంగ్స్ త్వరగా పూర్తి చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో సినిమాలో ఐటం సాంగ్ చేయడానికి అనసూయని సంప్రదించగా .. అంతా ఓకే అయినట్లు సాంగ్ చేయటానికి ఆమె రెడీ అయినట్లు, అంతే కాకుండా ఈ ఒక్క సాంగ్ కోసం అనసూయ ఏకంగా 20 లక్షలు తీసుకుంటున్నట్లు ఫిలిం నగర్ టాక్.