బుల్లితెరపై ఈ మధ్య స్పెషల్ ఈవెంట్ ల జోరు భారీగా కొనసాగుతోంది. ఒకరిని మించి ఒకరు ఈవెంట్లను ప్లాన్ చేశారు. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడమే లక్ష్యంగా తమదైన శైలిలో అందరినీ నవ్వించే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. ఇక అందులోనే ప్రేమకథలు, సెంటిమెంట్ ను జత చేస్తూ ఎవరి ట్రాక్ లో వాళ్ళు వెళ్తున్నారు.
ఎంత ఫన్ ఇస్తారో అంతగా భావోద్వేగానికి గురి చేసి ఏడిపిస్తారు. తాజాగా విడుదలైన ‘అక్కా ఎవరే అతగాడు’ ఈవెంట్ ప్రోమో లో చాలా ఎమోషనల్ గా చేశారు. తాజాగా ప్రదీప్, శ్రీముఖి పైన జీ తెలుగులో చేసిన ఈ షో లో దేశభక్తి ఇచ్చిన సందేశం అందరినీ ఆకట్టుకుంది.
ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఛానల్ లు స్పెషల్ ఈవెంట్ లతో రెడీ అయిపోయాయి. ఇక వీటిలో జీ తెలుగు వారు చేసిన ‘అక్క ఎవరే అతగాడు’ ఈవెంట్ లో ఎంతో వినోదం ఉండబోతోంది అని తెలుస్తోంది. అలాగే దివంగతులైన హాస్యనటుల ను గుర్తు చేస్తూ ఏవీఎస్, కొండవలస, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అలీ, వేణుమాధవ్, జయప్రకాష్ రెడ్డి లాంటి కమెడియన్ ల డూప్ లను పట్టుకొచ్చారు. వారి ఫ్యామిలీ లను కూడా తెరపైకి తీసుకువచ్చారు.
దీంతో ఈసారి ఈవెంట్ ను చాలా భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు కామెడీ స్కిట్స్, అనసూయ డాన్స్ పర్ఫార్మెన్స్ బోలెడున్నాయి. ఇక గల్వాన్ లోయలో చైనా సైనికుల తో పోరాడి వీరమరణం పొందిన సంతోష్ బాబు కి నివాళి అర్పించారు. దేశభక్తి డాన్స్ పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఇక అనసూయ ఆ దేశ భక్తి పర్ఫార్మెన్స్ చూసి కన్నీరు పెట్టుకుంది.