Chiranjeevi: బుల్లితెరపై అదేవిధంగా వెండితెరపై ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా అనసూయ కెరియర్ కొనసాగుతోంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ లో అనసూయ బంపర్ ఆఫర్ లు అందుకుంటూ కీలక పాత్రలు పోషిస్తోంది. ఇటీవలే సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ నటించిన పాన్ ఇండియా సినిమా “పుష్ప” లో… అనసూయ కీలక పాత్ర పోషించడం జరిగింది. నెగిటివ్ రోల్ లో కనిపించింది. అంతకుముందు ఇదే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన “రంగస్థలం”లో రంగమ్మత్త క్యారెక్టర్ చేసి.. సినిమాకే హైలెట్ గా నిలిచింది.
ఈ తరహాలో ఒక పక్క బుల్లితెరపై మరోపక్క వెండితెరపై రెచ్చిపోతున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా… అదరగొట్టే అందాల ఫోటోలు పోస్ట్ చేస్తూ కీలకంగా రాణిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న “బోలా శంకర్” సినిమా లో… ఓ కీలక పాత్ర చేయడానికి అనసూయ నీ… తీసుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి సినిమా కావటంతో ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండ అనసూయ ఓకే చెప్పటం జరిగిందట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తిసురేష్ కనిపిస్తోంది.
త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఈ అవకాశంతో మెగా హీరోలలో రామ్ చరణ్, బన్నీతో అవకాశాలు అందుకుని..ఇప్పుడు చిరంజీవి తో కూడా ఛాన్స్ దక్కించుకోవడం మెగా అభిమానుల లో సరికొత్త డిస్కషన్ కి తెరలేపటం జరిగింది. ఇంకా పవన్ సినిమాలో అవకాశం అనసూయ దొరికితే దాదాపు మెగా కాంపౌండ్ లో… మెయిన్ హీరోలను అనసూయ.. కవర్ చేసినట్లే అని ఇండస్ట్రీ వాళ్ళు అంటున్నారు. గతంలో అనసూయా కి పవన్ నటించిన “అత్తారింటికి దారేది” సినిమాలో అవకాశం.. రావడం జరిగిందట. కానీ ఆ సమయంలో అనుకోని కారణాలవల్ల ఛాన్స్ మిస్ అవ్వడం జరిగింది అని స్వయంగా అనసూయ చెప్పింది. ఈ తరుణంలో మెగాస్టార్ మూవీ లో అనసూయకి అవకాశం రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.