పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ ద్వారా పరిచయం అయిన ముద్దుగుమ్మ వర్షిణి. తను తర్వాత పెద్దగా సినిమాల్లో, వెబ్ సిరీస్ లో కనిపించలేదు. కానీ బుల్లి తెరలో యాంకర్ గా అడుగు పెట్టి తక్కువ సమయంలో చాలా మందికి ఫేవరెట్ యాంకర్ గా మరిపోయింది. ఇక ఈటీవి లో వచ్చే పటాస్ 2 ప్రోగ్రాం ఆమెకు మంచి పేరు తెచ్చింది. తరువాత ఢీ షోతో యువతకు చాలా దగ్గరైంది ఈ అమ్మడు.
ఈ అందమైన చిన్నది తన ముద్దు ముద్దు మాటలతో యూత్ ను ఆకట్టుకుంటుంది. తన అందమైన నవ్వు ఎంతో మందికి ఇష్టం. పటాస్ 2 షో యాంకర్ వర్షిణి అంటే బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలుసు. ఈ మధ్య ఢీ షోలో హాట్ హాట్ గా డ్యాన్స్ చేస్తూ.. యువకుల మతి పోగొడుతుంది ఈ చిన్నది. ఈ మధ్యే ఆలీ హోస్ట్ గా ఉండే షోలో పాల్గొని రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ మద్దుగుమ్మ టీవీ రియాలిటీ షోలు, వెబ్ సిరీస్ లతోనూ బిజీ బిజీగా ఉంటోంది. అయితే తన ఫ్యామిలీ గురించి పెద్దగా ఎక్కడా చెప్పుకోని ఈ చిన్నది. ఒక టీవి షోలో తన అక్కతో పాటు పాల్గొంది. అందులో ఎన్నో విషయాలను పంచుకుంది. ఆ షో యాంకర్ రవితో చేసింది. ఈ షో లో వర్షిణి సోదరి పాల్గొని ఆమె సీక్రెట్లను బయటపెట్టింది. వర్షిణికి ఒక వింత జబ్బు ఉందని చేప్పుకొచ్చింది. దాంతో యాంకర్ రవి షాక్ అయ్యాడు.
ఆ జబ్బు ఏంటంటే వర్షిణికి నిద్రలో నడిచే అలవాటుందంటా.. ఒకసారి ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు.. మధ్యలో ఒక స్టేషన్లో ట్రైన్ ఆగితే నిద్రలో లేచి నడుస్తూ దిగిపోయిందని ఆమె సోదరి తెలిపింది. ఇలా పలు అంశాలు చెబుతూ.. వర్షిణిని అటూ యాంకర్ రవిని ఆశ్చర్యపరిచింది. వీరంతా ఈ ప్రోగ్రాం ద్వారా చాలా ఎంజయ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రోగ్రాం పలువురిని ఆకట్టుకోనున్నట్లు సమాచారం. అయితే ఎంతవరకూ ప్రేక్షకులకు నచ్చుతుందో వేచి చూడాలి.