మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ “F2”. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో వంద కోట్ల క్లబ్ లో చేరి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించింది. అంతేకాకుండా అప్పట్లో “F2” క్లైమాక్స్ లోనే “F3” ఉంటుంది అంటూ హింట్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి వెంటనే అప్పట్లో సీక్వెల్ పనులు ప్రారంభించినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ మధ్యలో సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా ఛాన్స్ రావడంతో “F3” ఆలస్యమైనా పూర్తిగా పక్కన మాత్రం పెట్టలేదు.
“సరిలేరు నీకెవ్వరు” సినిమా బ్లాక్ బస్టర్ విజయం తర్వాత అనిల్ తిరిగి తన దృష్టి మొత్తం “F3” సీక్వల్ స్క్రిప్ట్ పై దృష్టి పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే ఫైనల్ వెర్షన్ కూడా లాక్ చేయడం జరిగిందట. దీంతో తొలుత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి ఇప్పుడు ప్లాన్ మార్చారట. ఈ ఏడాది నవంబర్ నుండే సినిమా సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి ఫిక్స్ అయ్యారట. అంతేకాదు గతంలో లో సినిమా మొత్తం బ్యాంకాక్ లో షూట్ చేసేలా ప్లాన్ చేసిన…. ప్రస్తుతం విదేశాలలో సినిమా షూటింగ్ కష్టమన్న ఉద్దేశంతో అనిల్ రావిపూడి ప్లాన్ మార్చుకున్నారట.
సినిమా మొత్తం స్వదేశంలోనే ఎక్కువగా కేరళ రాష్ట్రంలో తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు అందుకు తగ్గ రీతిలో సినిమా స్క్రిప్ట్ లో మార్పులు కూడా చేసినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. నిర్మాత దిల్ రాజు… వెంకీ, వరుణ్ లు కూడా ఈ ప్రాజెక్టు విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారట. ప్రస్తుతం వెంకీ “నారప్ప” షూటింగ్ లో ఉన్నారు. అక్టోబర్ కల్లా “నారప్ప” షూటింగ్ కంప్లీట్ చేసి అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ కి రెడీ కాబోతున్నారట. వరుణ్ ఆల్రెడీ ఇప్పటికే రెడీగా ఉన్నట్లు టాక్.