దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు యువ కథానాయకుడు నాగశౌర్యతో ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మూడు పోర్షన్స్లో సాగుతుంది. ఒక్కొక్క పోర్షన్ను ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తాడు. ఒక హీరో, ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. సినిమాను ముగ్గురు దర్శకులు తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ముగ్గురు దర్శకుల్లో ఒకరుగా క్రిష్ ఓకే అయ్యారు. ఇప్పుడు మరో దర్శకుడిగా ఆయన తనయుడు ప్రకాశ్ కోవెలమూడిని ఓకే చేసినట్లు వార్తలు వినపడుతున్నాయి. బాహుబలి నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డలతో పాటు దిల్రాజు కూడా నిర్మాణంలో భాగమయ్యారని కూడా వార్తలు వినపడుతున్నాయి.
previous post