యంగ్ రెబల్ స్టార్ క్రేజ్ మాములుగా లేదు. ఆయన వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఆయన యాక్టింగ్ కు దేశ నలుముల నుంచి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే బాహుబలి తర్వాత వచ్చిన సినిమా మంచి వసుళ్లను రాబట్టకపోయినా కానీ ప్రభాస్ స్టైల్ కు సినీ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దాంతో ఆయన నెక్ట్స్ సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.
కేజీఎఫ్ లాంటి సినిమాను డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ ఒకటైతే.. అందులో ప్రభాస్ నటించడం మరొకటి. దాంతో సలార్ సినిమాకు అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్న ఈ సలార్ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని ఇప్పటికే టాక్. వీలైనంత తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జరగనుందని సమాచారం. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నటించే సహ నటీ నటిమనుల వేటలో సినీ యూనిట్ పడింది. రెబల్ స్టార్ సరసన నటించే అమ్మడు ఎవరనేది రోజుకో వైపు తిరుగుతుంది. మొదట్లో ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్ గా నటించనుందనే రూమర్లు వచ్చాయి. తర్వాత సాయి పల్లవి నటించనుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ దీనిపై సినీ యూనిట్ మాత్రం ఏం చెప్పలేదు. ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లను సంప్రదించిన డైరెక్టర్. మునుపెన్నడూ సినిమాల్లో కనిపించని మోడల్స్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అది ఎవరు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియదు. అది తెలియాలంటే కొన్ని రోజుకు ఆగక తప్పదని పలువురు సినీ విశ్లేషకులు అంటున్నారు.