Boyapati: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ ఆడియన్స్ పల్స్ రేటు బాగా తెలిసిన స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. “వినయ విధేయ రామ” లాంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత.. బాలకృష్ణతో “అఖండ” సినిమా చేసి మరోసారి తన సత్తా చాటారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు సూపర్ డూపర్ హిట్ ఇచ్చి… హ్యాట్రిక్ విజయం అందుకోవడం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే.. ఇండస్ట్రీలో అప్పట్లో రాణించిన హీరోయిన్లు.. మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
స్టార్ హీరోల సినిమాలలో అక్క, వదినమ్మ, అమ్మ పాత్రలు చేస్తూ.. భారీ పారితోషికాలు అందుకుంటున్నారు. సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రాధాన్యత సంతరించు కుంటున్నారు. ఇప్పటికే ఈ రీతిగా విజయశాంతి, టబు, రమ్యకృష్ణ.. మరికొంతమంది హీరోయిన్లు రావడం తెలిసిందే. తాజాగా ఇదే జాబితాలో కి మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు టాక్. అప్పట్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో… హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించిన మీరా జాస్మిన్.. అమ్మాయి బాగుంది సినిమా తో వెండితెర పరిచయం అయింది.
ఆ తర్వాత పవన్ నటించిన “గుడుంబా శంకర్” సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఆ తర్వాత చాలా అవకాశాలు అందుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే బోయపాటి ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రాజెక్టుకు సంబంధించి పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మీరా జాస్మిన్ నీ బోయపాటి తీసుకున్నట్లు టాక్. మీరాజాస్మిన్ గతంలో బోయపాటి దర్శకత్వంలో రవితేజ నటించిన భద్ర సినిమాలో హీరోయిన్ గా.. చేయటంతో.. పెళ్లయి సినిమాలకు దూరమైన ఆమెను ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇప్పించడానికి బోయపాటి రెడీ అయినట్లు ఇండస్ట్రీ టాక్. ఇక ఇదే సమయంలో సినిమాలో.. రామ్ పోతినేని నీ.. రెండు డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించడానికి.. సరికొత్త ప్రయోగం చేయడానికి డైరెక్టర్ ఆలోచన చేస్తున్నట్లు కూడా టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది.