Trivikram Mahesh: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. మార్చి నెల నుండి సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా రెండో సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. రెండు సినిమాలలో కూడా చాలా విభిన్నంగా మహేష్ బాబు త్రివిక్రమ్ చూపించాడు. దీంతో మూడో సినిమా లో మహేష్ బాబుని ఏ రకంగా చూపిస్తాడు అన్నది సస్పెన్స్ గా నెలకొంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో మోహన్ లాల్ నీ చూపించే ఆలోచనల్లో త్రివిక్రమ్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. గతంలో త్రివిక్రమ్ తన సినిమాలో సన్నాఫ్ సత్యమూర్తి లో ఉపేంద్ర నీ అద్భుతంగా చూపించారు. ఆ తర్వాత అరవింద సమేత వీర రాఘవ లో జగపతి బాబు ని విలన్ గా చూపించారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు సినిమాలో మోహన్ లాల్ కి మంచి రోల్ గురూజీ ఇచ్చినట్లు టాక్.
ఇదిలా ఉంటే ఈ సినిమాని చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నట్లు సమాచారం. కరోనా కారణంగా దాదాపు రెండున్నర సంవత్సరాల గ్యాప్ రావడంతో…. మహేష్ కూడా తక్కువ టైం లో సినిమా కంప్లీట్ అయ్యేలా చూడాలని .. అదే రీతిలో షెడ్యూల్ ప్రిపేర్ చేయాలని ముందుగానే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్న ట్లు సౌత్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని.. మోహన్ లాల్ కి ప్రత్యేకమైన క్యారెక్టర్ త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో పొందుపరిచినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.