Anushka sharma: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న అనుష్క శర్మ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ దంపతులిద్దరికీ ఈ ఏడాది జనవరిలో పండంటి ఆడ బిడ్డ జన్మించింది. పాపకు సంబంధించిన ఫోటో అప్పట్లో బాగా వైరల్ అయింది. ముఖ్యంగా మహిళల జీవితంలో పెళ్లి ,పిల్లలు అనేది ఎంతో ముఖ్యమైన విషయం. ఈ క్రమంలోనే అనుష్క శర్మ కూడా విరాట్ కోహ్లీను పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సాధారణంగా బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆరు నెలల పాటు బిడ్డకు తల్లి అవసరం చాలా ఉంటుంది కనుక ఆరు నెలల వరకు ఎక్కడికి వెళ్ళకుండా బిడ్డ దగ్గరే ఉంటారు.
మన సెలబ్రిటీలు మాత్రం బిడ్డకు జన్మనిచ్చిన 2, 3 నెలలకే వారిని వదిలి వారి పనుల్లో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం అనుష్క శర్మ కూడా అదే అడుగుజాడల్లో నడుస్తున్నారు. తన పాపకు జన్మనిచ్చిన కేవలం మూడు నెలలకే అనుష్క షూటింగ్ లలో బిజీ అయ్యారు. తాజాగా అనుష్క ఓ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ యాడ్ కి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు అనుష్కకు సంబంధించినటువంటి ఒక పాత వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ మాట తప్పావ్ అనుష్క అంటూ ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు.
ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్ టాక్ షో :
అనుష్క శర్మ 2012వ సంవత్సరంలో ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్ టాక్ షో హోస్ట్ సిమి గరేవాల్తో ఇంటర్వ్యూ సందర్భంగా పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత నటిస్తారా? అనే ప్రశ్నను అనుష్కని అడగగా.. పెళ్లి తర్వాత పనిచేయదలుచుకోవడం లేదని చెప్పారు. వివాహం తనకు చాలా ముఖ్యమని, పెళ్లి చేసుకొని పిల్లలను కనాలని అనుకుంటున్నాననీ అనుష్క తెలియజేశారు. అప్పుడు ఆ విధంగా మాట్లాడిన అనుష్క ప్రస్తుతం పెళ్లి అయ్యి, పాప పుట్టిన మూడు నెలలకే ఒక యాడ్ షూట్లో పాల్గొనడంతో మాట తప్పావ్ అనుష్క అంటూ ఆమెను ప్రశ్నిస్తూ ఈ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.