Anushka Shetty: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అంతా పాన్ ఇండియన్ సినిమా ల హవా నడుస్తోంది. మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియన్ కథలను ఎంచు కుంటున్నారు. నాలుగైదు భాషలలో రిలీజ్ చేసి పాన్ ఇండియన్ స్టార్ అనే క్రేజ్ను దక్కించుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే పాన్ ఇండియన్ సినిమాలతో హీరోయిన్స్కు అదే రేంజ్ క్రేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్స్ అంటే రష్మిక మందన్న, పూజా హెగ్డేలనే చూస్తున్నారు. కియారా అద్వానీ కూడా ఈ లిస్ట్లో చేరబోతోంది. అయితే, వీరందరికంటే ముందే స్వీటీ అనుష్క శెట్టి బాహుబలి సినిమాలతో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్తో పాటు పాన్ ఇండియన్ స్టార్గా క్రేజ్ తెచ్చుకుంది.
ఈ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఆశించినంత జోరుగా సాగడం లేదు. తన ఫిజిక్లో వచ్చిన మార్పుల కారణంగా సినిమాల సంఖ్య బాగా తగ్గింది. అనుష్క నుంచి సినిమా వచ్చి చాలా నెలలవుతోంది. నిశ్శబ్ధం సినిమా వచ్చి అందరినీ తీవ్రంగా నిరాశ పరచింది. మూగ చెవిటి యువతిగా తనవరకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా కథ, కథనం ఆసక్తికరంగా లేకపోవడంతో సినిమా ఫ్లాప్గా నిలిచింది. దాంతో మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించడానికి చాలా నెలల సమయం తీసుకుంది. ఇక గత ఏడాది తన పుట్టినరోజు నాడు మేకర్స్ అనుష్క కొత్త చిత్రాన్ని ప్రకటించారు.
Anushka Shetty: ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో నిర్మించనున్నారట.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి ఈ సినిమాలో అనుష్కతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. రెగ్యులర్ షూటింగ్ కోసం మేకర్స్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది మల్టీస్టారర్ మూవీ అమ్మ బయోపిక్ తలైవిని తీసిన దర్శకుడు ఏ ఎల్ విజయ్ అనుష్కకు ఓ కథ చెప్పగా అది ఆమెకు నచ్చి వెంటనే సినిమా చేసేందుకు రెడీ అయినట్టు సమాచారం. లేడీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో నిర్మించనున్నారట. ఇదే నిజమైతే అనుష్క మళ్ళీ గేర్ మార్చి స్పీడ్ పెంచబోతున్నట్టే.