Prabhas-Aanushka: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు జోడీగా అందాల భామ అనుష్క సెట్టైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల `రాధేశ్యామ్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సరసన `సలార్`, ఓం రౌత్తో `ఆదిపురుష్`, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో `ప్రాజెక్ట్-కె`, సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` చిత్రాలు చేస్తున్నాడు.
వీటిలో ఆదిపురుష్ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. సలార్, ప్రాజెక్ట్-కె సినిమాలు సెట్స్ మీదే ఉన్నాయి. స్పిరిట్ మరి కొద్దిల్లో ప్రారంభం కానుంది. అయితే ప్రముఖ దర్శకుడు మారుతితో ప్రభాస్ ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని ఎప్పటి నుంచో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుగుతున్నాయని అంటున్నారు.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ సీక్రెట్ లీకైంటి. అదేంటంటే.. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు కనువిందు చేయనున్నారని టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో ఒక హీరోయిన్గా అనుష్క శెట్టి నటించబోతోంది. ఇటీవలె మేకర్స్ అనుష్కను సంప్రదించి కథ చెప్పగా.. అది నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారమై నిజమైతే ఇటు ప్రభాస్ ఫ్యాన్స్, అటు అనుష్క ఫ్యాన్స్ ఎగిరి గంతేయం ఖాయం. ఎందుకంటే, వీరిద్దరి జోడీ ఆన్ స్క్రీన్ పైనే కాదు.. ఆఫ్ స్క్రీన్లోనూ చూడముచ్చటగా ఉంటుంది. ఇప్పటికే బిల్లా, మిర్చి చిత్రాల్లో జోడీగా నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ జంట.. మళ్ళీ జత కడితే అభిమానులకు కన్నుల పండగే అవుతుంది.