అనుష్క తన కొత్త సినిమా `సైలెన్స్` సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. `వస్తాడు నా రాజు` ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నాయి. తెలుగులో `నిశ్శబ్దం`.. మిగిలిన భాషల్లో సైలెన్స్ పేరుతో సినిమా విడుదలకానుంది. మాధవన్ సహా హాలీవుడ్ యాక్టర్ మైకేల్ హడ్సన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. భాగమతి తర్వాత అనుష్క నటిస్తోన్న చిత్రమిది. బరువు తగ్గి స్లిమ్గా తయారైన అనుష్క తొలిసారి నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి.
previous post
next post