`భాగమతి` తర్వాత అనుష్క మరో సినిమాలో నటించలేదు. సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క బరువు తగ్గడానికి ఏడాది పైగానే సమయాన్ని తీసుకుంది. సన్నగా మారిన తర్వాత అనుష్క చేస్తోన్న సినిమా `సైలెన్స్`. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సైలెన్స్ థ్రిల్లర్ ఇది. మాధవన్ సహా హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో చిత్రీకరణను స్టార్ట్ చేసుకోవాల్సింది. కానీ.. అనుష్కకు వీసా లేకపోవడంతో సినిమా ఆగింది. అనుష్క ఓవన్ వీసాకు అప్లై చేసుకుంది. అయితే ఈ వీసా రావడానికి చాలా సమయమే పట్టింది. ఎట్టకేలకు సినిమా మే చివరి వారంలో స్టార్ట్ అవనుంది. సైలెన్స్ చిత్రానికి కోన వెంకట్ కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.
previous post
next post