Omkar Dance Plus : తెలుగు బుల్లితెరపై విభిన్న రీతిలో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఓంకార్ ఒకరు. ఓంకార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో టెన్షన్ పెడుతూ, కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల బుర్రలకు పదును పెట్టిస్తాడు. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, రేటింగ్స్ కోసం ఎంతకైనా సాహసిస్తాడు.
ఓంకార్ ఏదైనా ప్రోగ్రాం చేస్తున్నాడు అంటే కచ్చితంగా అందులో ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఓంకార్ ప్రస్తుతం డాన్స్ ప్లస్ అంటూ ప్రస్తుతం ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్లో షో చేస్తున్నాడు. ఈ షో లో జడ్జీలుగా రఘు మాస్టర్, యష్ మాస్టర్, బాబా మాస్టర్, అనీ మాస్టర్,మోనాల్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ డాన్స్ షో లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ డాన్సులను చేస్తూ ఎంతో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. అయితే ఓంకార్ డాన్స్ కు జడ్జిమెంట్ కోసం కొన్నిసార్లు జడ్జీల మధ్య గొడవలు పెడుతుంటారు. ఈ విధంగా గొడవల కారణంగా కూడా షో రేటింగ్స్ కూడా పెరుగుతాయన్న ఉద్దేశంతో ఓంకార్ ఈ విధంగా వ్యవహరిస్తుంటారు.
చిన్న పిల్లలతో ఆ పాటకు డాన్స్ వేయించిన ఓంకార్:
ఓంకార్ ప్రస్తుతం చేస్తున్న షో డాన్స్ ప్లస్ కావడంతో ఈ షోలో చిన్నపిల్లలతో ఏకంగా “బావలు సయ్య.. మరదలు సయ్య”అనే పాటకు డాన్స్ వేయించారు. ఈ విధంగా చిన్న పిల్లలతో ఐటమ్ సాంగులకు డాన్స్ లు చేయించడంతో….నెటిజన్లు ఏంటయ్యా ఓంకార్ అన్నయా.. ఇది చిన్న పిల్లలతో ఈ విధంగా బావల సయ్య అనిపించడం ఏంటంటు విమర్శలు చేస్తున్నారు. నీ షో రేటింగ్స్ కోసం పసిపిల్లలతో ఈ విధమైన డాన్స్ చేయిస్తారా అంటూ నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఆదివారం ప్రసారం కాబోయే ఈ డాన్స్ షో కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఎంతో మంది నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ విషయమై స్పందించిన పలువురు నెటిజన్లు ఓంకార్ పై తీవ్ర విమర్శలు చేస్తు కామెంట్లు పెడుతున్నారు.