Ram Charan: కరోనా వేవ్ దెబ్బతో పాటు ఏపీలో ప్రభుత్వం పెట్టిన కండీషన్స్కు మన టాలీవుడ్ సినిమాల వసూళ్ళ మీద తీవ్రంగా ప్రభావం పడుతోంది. గత నెల వచ్చిన భీమ్లా నాయక్ సినిమా పై ప్రభావం బాగా పడింది. ఓవరీస్తో పాటు ఇండియాలో అన్నీ చోట్లా ఈ సినిమా బ్రేకీవెన్ టార్గెట్ రీచ్ అయింది. కానీ ఒక్క ఏపీలో ఉన్న టికెట్ ధరల కారణంగా నష్టాలను చూడాల్సి వచ్చింది. ఆ ఒక్క చోట తప్ప మిగతా ఎక్కడా భీమ్లా
నష్టాలను చూడలేదు.
అయితే, ఇటీవల కొత్త జీవోను సవరించి జారి చేసిన సంగతి తెలిసిందే. అలాగే, చిన్న సినిమాకు 5వ ఆటను ప్రదర్శించుకునే వీలు కూడా కల్పిస్తూ అనుమతులు ఇచ్చింది జగన్ ప్రభుత్వం. ఇక ఆంధ్రప్రదేశ్లో 20% మించి గనక షూటింగ్ జరుపుకుంటే అలాంటి భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే వీలు కల్పిస్తామని జగన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
Ram Charan: తెలుగులో లాభపడనున్న మొదటి సినిమా ఆర్సీ 15.
దీనిలో హీరోతో పాటు దర్శకుల రెమ్యునరేషన్ కలపకూడదు అనేది కండీషన్. ఇవి కాకుండా రూ. 100కోట్లు పైగా బడ్జెట్ తో నిర్మిస్తే ఆ చిత్రానికి టికెట్ ధరల్ని రిలీజైనప్పటి నుంచి 10 రోజులు పెంచుకునే వీలును కల్పిం చింది జగన్ సర్కారు. ఇది ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రాం చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే వారు చెప్పిన 20% కంటే ఎక్కువే అక్కడ షూటింగ్ జరుగుతోంది. ఈ నిబంధనల ప్రకారం తెలుగులో లాభపడనున్న మొదటి సినిమా ఆర్సీ 15.
కాగా, దిల్ రాజు ఈ సినిమాకు 200 కోట్లకు పైగానే బడ్జెట్ కేటాయిస్తున్నారట. చరణ్ సరసన ఇందులో కియారా అద్వానీని హీరోయిన్గా ఎంపిక చేశారు. ఏపీలో లాంగ్ షెడ్యూల్ జరుగుతుండగా థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయా న్ని నిర్మాత దిల్ రాజు ఆల్రెడీ ప్రకటించాడు.