Veera Simha Reddy: నట సింహం నందమూరి బాలయ్య బాబు కొత్త సినిమా “వీరసింహారెడ్డి” సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. తమన్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు మరియు పోస్టర్ లు, వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. పైగా దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఇప్పటివరకు ఒక పరాజయం కూడా లేకపోవడంతో “వీరసింహారెడ్డి” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇక ఈ సినిమా సమరసింహారెడ్డికి 200 రెట్లు ఉంటుందని స్వయంగా డైరెక్టర్ చెప్పడంతో అంచనాలు డబల్ అయ్యాయి. ఇప్పటికే బాలయ్య “అన్ స్టాపబుల్” షో ద్వారా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటూ మంచి ఎనర్జిటిక్ మీద ఉన్నారు. ఈ షో బాలయ్య క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లింది అని అనటం ఎటువంటి సందేహం లేదు. ఈ పరిణామంతో “వీరసింహారెడ్డి” చూడటానికి మిగతా హీరోల అభిమానులు కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే వచ్చే వారమే రిలీజ్ కానున్న నేపథ్యంలో జనవరి 6వ తారీకు సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరుపుతున్నట్లు వీడియో ద్వారా మేకర్స్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఆరవ తేదీ 6 గంటలకు ఒంగోలులోని ABM కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
ఇంకా అదే రోజు ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈవెంట్ కి ఏపీ పోలీస్ శాఖ అనుమతి నిరాకరించడం జరిగిందట. ఇంత పెద్ద కార్యక్రమం వల్ల ట్రాఫిక్ కి అంతరాయం కలిగే అవకాశం ఉందని పోలీసులు సూచించారట. వీలైతే ఒంగోలు వెలుపల నిర్వహించుకోవాలని తెలిపారట. ఈ పరిణామంతో గతంలో మహానాడు జరిగిన ప్రాంతంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని సినిమా యూనిట్ భావిస్తుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!