ఎప్పుడో త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన “అ..ఆ” సినిమాతర్వాత మళ్ళీ హిట్ అన్నది దక్కించుకోలేకపోయాడు యంగ్ హీరో నితిన్. మద్యలో వచ్చిన సినిమాలన్ని వరసగా ఫ్లాపవుతూ నితిన్ బాగా డిసప్పాయింట్ చేశాయి. దాంతో కొన్ని నెలలు గ్యాప్ తీసుకొని మంచి కథ లు సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. వాటిని ఒక్కొక్కటిగా సెట్స్ మీదకి తీసుకు వస్తున్నాడు. అలా వచ్చిన “భీష్మ” సినిమాతో మంచి కమర్షియల్ హిట్ ని సాధించాడు.
ఇక ప్రస్తుతం నితిన్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ మూడు సినిమాలతోను వరసగా హిట్ అందుకుంటా అన్న ధీమాతో ఉన్నాడు నితిన్. ఇప్పటికే కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న రంగ్ దే దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ సూపర్ హిట్ “అంధధూన్” లో నటించబోతున్నాడు.
ఈ సినిమాలో కూడా కీర్తి సురేష్ ని హీరోయిన్ గా అనుకున్నప్పటికి తను ఆసక్తి చూపించలేదట. అలాగే ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా ని అనుకుంటున్నట్టు వార్తలు వినిపించాయి. కాని రీసెంట్ గా ఈ సినిమాలో నటించడం లేదని ఇలియానా క్లారిటీ ఇచ్చింది. టాలీవుడ్ నుంచి వచ్చిన ఆఫర్ ని ఇలియానా వద్దనడానికి మంచి రీజనే ఉందని సమాచారం. అంధాధున్ లో హీరోయిన్ గా రాధిక ఆప్టే.. వయసు మళ్ళిన పాత్రలో టబు నటించింది. అయితే ఇలియానా…రాధిక ఆప్టే పాత్రకి అడిగితే ఒప్పుకునేదేమో…కాని టబు చేసిన పాత్ర అనగానే నో చెప్పిందట. ఇలియానా గ్లామర్ కి వయసు మళ్ళిన పాత్ర ఎలా చేస్తుంది చెప్పండి..మరీ అంత దారుణంగా ఎలా అడిగారో..?