Sandeep Reddy Vanga: కంప్లీట్ రా కంటెంట్తో అర్జున్ రెడ్డి రిలీజ్..అంటూ సర్ప్రైజింగ్ అప్6డేట్ ఇచ్చారు చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా మిగిలింది. అంతేకాదు, రౌడీ హీరోగా తనకి ఈ సినిమా తీసుకొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దాదపు అయిదు సంవత్సరాల క్రితం వచ్చిన అర్జున్ రెడ్డి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించింది. ఇదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేశారు.
బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించారు సందీప్ రెడ్డి వంగ. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమాతో హీరో హీరోయిన్స్ ఇద్దరికీ మంచి క్రేజ్ వచ్చింది. కబీర్ సింగ్ తర్వాత అక్కడ షాహిద్ మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. ఇక తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా రీమేక్ చేసిన అర్జున్ రెడ్డి ఆయా భాషలలో కూడా భారీ స్థాయిలో వసూళ్ల ను రాబట్టింది. ఇలా అర్జున్ రెడ్డి విడుదల అయిన ప్రతి చోట కూడా భారీగా విజయాలను దక్కించుకుంది.
Sandeep Reddy Vanga: థియేట్రికల్ రిలీజ్ అవుతుందా లేక ఓటీటీ రిలీజ్ అవుతుందా..?
అయితే, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలిపారు. దాదాపు నాలుగున్నర గంటల కంటెంట్ ఉంటే దానిని ఎడిట్ చేసి ఫైనల్గా దాదాపు మూడు గంటల సినిమాను రిలీజ్ చేశారు. ఇప్పుడు టోటల్ రా కంటెంట్ మొత్తాన్ని ఎడిట్ చేసి రీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. మంచి ఇంటెన్సివ్ సీన్స్ ఉన్న ఈ సినిమా ఇలా కంప్లీట్ రా కంటెంట్తో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో..ఎన్ని సీన్స్ మిస్ అయి ఉంటామో అని ఆతృతగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి ఇంత లెంగ్తో థియేట్రికల్ రిలీజ్ అవుతుందా లేక ఓటీటీ రిలీజ్ అవుతుందా అనేది త్వరలో క్లారిటీ రానుంది.