Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిటయిన సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి. ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తైంది. ఆ తర్వాత రక రకాల కారణాల వల్ల షూటింగ్కు బ్రేక్ పడింది. ఇంతకాలం పవన్ కమర్షియల్ ఎంటర్టైనర్స్, ఫ్యామిలీ చిత్రాలు చేస్తూ వచ్చిన పవన్ మొదటి సారి ఓ పీరియాడికల్ సినిమాను చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో మొగల్ కాలంలో నడిచే ఈ కథతో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ ఓ దొంగగా నటిస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు.
అయితే, ఇన్ని నెలల నుంచి నిలిచిపోయిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మళ్ళీ మొదలవబోతోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్స్ను సిద్దం చేసినట్టు తాజా సమాచారం. దీనికోసం పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడు ..ఆర్ట్ డైరెక్టర్ రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారట. మొగల్ కాలంలో ఈ సినిమా కథ కావడం వల్ల అప్పటి కట్టడాలకు సంబంధించిన భారీ సెట్లు సిద్దం చేస్తున్నారు. ‘వీరమల్లు’ సినిమా సెట్ల విషయంలోను ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిర్మించారు. ఇక ఈ సెట్స్ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తాయని స్వయంగా ఆనంద్ సాయి అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని తెలిపారు.
Pawan kalyan: హరిహర వీరమల్లు సినిమా ఆగిపోలేదు.
ఇక అందరూ అనుకున్నట్టు హరిహర వీరమల్లు సినిమా ఆగిపోలేదు. ఫిబ్రవరి లేదా మార్చ్ నుంచి ఈ సినిమా మళ్ళీ సెట్స్ మీదకు రాబోతోంది..అని క్లారిటీ ఇచ్చారు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియన్ సినిమాగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషలలో ఒకేసారి ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అన్నీ అనుకున్నట్టు పూర్తైతే మాత్రం ఈ ఏడాది ద్వితీయార్థంలో హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్ చేయనున్నారు.