పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఇటీవల షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పుడే ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. `విజయవంతంగా తొలి షెడ్యూల్ను పూర్తి చేశాం. జయదేవ్ గల్లా ఈరోజు సెట్స్కు రావడం మరింత ఉత్సాహాన్ని నింపింది. మంచి చిత్ర బృందం లవ్ యు ఆల్` అని యూనిట్ తెలియజేసింది. హీరో అశోక్ గల్లా కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రతి క్షణం నాకెంతో బాగా నచ్చింది` అన్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తుండగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.