మెగా కాంపౌండ్ నుండి ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోగా వైష్ణవ తేజ్ రికార్డు సృష్టించాడు. సుకుమార్ శిష్యుడిగా పేరుపొందిన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో పుట్టిన సినిమా చేసి హీరోగా మొదటి సినిమాతోనే తిరుగులేని విజయాన్ని అందుకోవటం జరిగింది. ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవ తేజ్ నటన ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. మొదటి సినిమాగా హీరోయిన్ కృతి శెట్టికి కూడా భారీ హిట్ పడ్డటం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల ఒక ముందే మెగాస్టార్ చిరంజీవి నటించిన “శంకర్ దాదా ఎంబిబిఎస్” లో వైష్ణవ తేజ్ బాల నటుడిగా నటించడం తెలిసిందే.
ఆ సినిమాలో అవయవాలు ఏమి పనిచేయని పాత్రలో వీల్ చైర్ లో కూర్చుని పోయే బాలుడి పాత్ర మనోడే చేయడం జరిగింది. అసలు ఆ పాత్రకి ఎటువంటి డైలాగులు ఏమీ ఉండవు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కీలకమైన సన్నివేశం చిత్రీకరిస్తుంటే పీల్చేర్లో కూర్చున్న తనకి ఒక్కసారిగా నవ్వు రావడం జరిగింది అని… ఆ టైంలో చిరంజీవి మామయ్య చాలా సీరియస్ అయ్యారు అని సరికొత్త విషయాన్ని వైష్ణవ తేజ్ ఇటీవల బయట పెట్టారు.
ప్రస్తుతం వైష్ణవ తేజ్… “రంగ రంగ వైభవంగా” అనే సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. గిరీషయ్యా దర్శకత్వంలో తేరకేకుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మించడం జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ అయ్యింది. ఫామిలీ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉన్నట్లు తెలుస్తోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!