Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించగా.. రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుండగా.. ఫస్ట్ `పుష్ప ది రైజ్` టైటిల్తో గత ఏడాది డిసెంబర్లో విడుదలై ఘన విజయం సాధించింది.
ఇందులో బన్నీ పుష్పరాజ్గా మాస్ మేకోవర్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మిస్మరైజ్ చేశాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సునీల్, ఫహాద్ ఫాజిల్ విలన్లుగా చేశారు. ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వడంతో.. సెకెండ్ పార్ట్ అయిన `పుష్ప ది రూల్`పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పార్ట్ 1కు మించి పార్ట్ 2ను తెరకెక్కించేందుకు సుకుమార్ వేరె లెవల్లో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అన్ని విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా బన్నీ ఫ్యాన్స్ను కలవరపెట్టే బ్యాడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. పుష్ప పార్ట్- 1 డిసెంబర్ 17న రిలీజై సూపర్ సక్సెస్ అయిన కారణంగా పుష్ప పార్ట్- 2 విషయంలోనూ అదే సెటిమెంట్ ఫాలో కాబోతున్నారట.
పుష్ప రెండో భాగానికి సైతం డిసెంబర్ 17నే ముహూర్తంగా పెట్టుకున్నారట. కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. 2022 కాకుండా 2023 డిసెంబర్ లో విడుదల చేయాలని, అప్పటికైతే ప్రమోషన్స్కు మంచిగా టైమ్ దొరుకుతుందని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా పుష్ప 2 కోసం 2023 డిసెంబర్ వరకు ఆగాలంటే అది ఫ్యాన్స్కి ఓ రకంగా బ్యాడ్ న్యూసే అవుతుంది.