మూడో వేవ్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన రాధేశ్యామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ పరాజయం పాలవడంతో ప్రభాస్ అభిమానులు నిరుత్సాహపడ్డారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. మూడు ప్రాజెక్టులు ఒప్పకున్నాడు. అందులో ఒకటి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో కాగా.. ఇంకోకటి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న సలార్ సినిమా ఒకటి.
ఇక టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడు. అయితే సలార్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమవ్వగా.. ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ కు గాయం అయింది. దీంతో యూరప్ వెళ్లి ప్రభాస్ మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నాడు. అయితే తిరిగి వచ్చిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. మళ్లీ ప్రభాస్ కు గాయమైంది. దీంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ యూరప్ వెళ్లాడు. అక్కడ గాయాన్ని పరీక్షించిన డాక్టర్లు.. పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారట.
దీంతో సలార్ షూటింగ్ మళ్లీ ఆగిపోయింది. ఇప్పుడు షూటింగ్ లు బంద్ కావడంతో సలార్ షూటింగ్ పై డైలమా నెలకొంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతున్నారు. ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే షూటింగ్ కూడా ప్రారంబం కావాల్సి ఉంది. ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనుండగా.. దీపిక పదుకొణే, దిషా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో జగపతిబాబు, ఈశ్వరీరావు, మధు గురుస్వామి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఓం రౌత్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కూడా ప్రారంభమైంది. ఇలా ప్రభాస్ చేతిలో మూడు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. అయినా షూటింగ్ లు ఆలస్యం అవుతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!