Pawan Kalyan: తెలుగునాట పవన్ కళ్యాణ్ ప్రభంజనం గురించి మనం ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పని లేదు. పవన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు. లేటెస్ట్గా ఈయన నటించిన ‘భీమ్లానాయక్’ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలై బాక్షాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధించింది. తాజాగా ఈ చిత్రం మార్చి 25న డిస్నీ+హాట్స్టార్ మరియు ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో బిజీగా గడుపుతున్నాడు. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్సింగ్’ సినిమా చేయాల్సి ఉంది.
Pawan Thaman: మరో పవన్ రీమేక్ సినిమాకి తమన్ మ్యూజిక్..??
Pawan Kalyan: ఝలక్ ఇచ్చిన మీర్జాపూర్ త్రిపాఠి!
ప్రస్తుతం ఈ చిత్రం బృందం ప్రీ ప్రొడక్షన్ పనులలో మంచి బిజీగా ఉంది. కలకత్తా బ్యాక్డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కావడం వలన ఈ సినిమాలో ‘మిర్జాపూర్’ నటుడు పంకజ్ త్రిపాఠి ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నట్లు గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ఇక తాజాగా పంకజ్ త్రిపాఠి ఈ వార్తలపై స్పందించాడు. “పవన్కళ్యాణ్తో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు నాకు సంతోషాన్ని కలిగించినా, దురదృష్టవశాత్తు అది నిజం కాదు!” అని అన్నారు.
Pawan kalyan: ఓటీటీలో వచ్చేస్తున్న ‘భీమ్లా నాయక్’..ఎప్పట్నుంచి అంటే..
మరింత సమాచారం:
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఈ డెడ్లీ కాంబినేషన్ కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఆయనతో కలిసి ఏదో ఒకరోజు పని చేస్తానని ఆశిస్తున్నాను… అని పంకజ్ ఈ నేపథ్యంలో పేర్కొన్నాడు. ‘మిర్జాపూర్’ సిరీస్తో ఈయనకు విపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసినదే. ఇకపోతే ఈ సినిమాలో పొడుగుకాళ్ల సుందరి అయినటువంటి పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. గబ్బర్ సింగ్ తరువాత పవన్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్నా సినిమా కావడం వలన ఈ సినిమాపైన భారీ అంచనాలు వున్నాయి.