Tollywood: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గత ఏడాది “అలా వైకుంఠపురం లో” సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే సినిమా హిట్ అయినా కొద్ది నెలలకే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా ప్రకటించేశాడు. అప్పటికే ఎన్టీఆర్ “RRR” షూటింగ్ లో ఉన్నారు. అయితే ఇంతలో మహమ్మారి కరోనా వైరస్ రావడంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో పరిస్థితులు మొత్తం మారిపోయాయి. 2020 లో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. మరో పక్క చూస్తే ఎన్టీఆర్ “RRR” షూటింగ్ లో ఇరుక్కుపోయారు. ఇప్పటికికూడా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.
ఇలాంటి తరుణంలో మధ్యలో త్రివిక్రమ్ సినిమా నుండి ఎన్టీఆర్ డ్రాప్ అవటం మాత్రమేకాక నెక్స్ట్ కొరటాలతో చేస్తున్నట్లు ప్రకటించేశారు. దీంతో ఆడిట్ కాకుండా త్రివిక్రమ్ పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్లు ఇటీవల త్రివిక్రమ్ అధికారికంగా ప్రకటించేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల బట్టి మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా మొత్తం కంప్లీట్ అయితే గాని… త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కించే ఛాన్స్ లేనట్టు ఫిలిం వర్గాలు అంటున్నాయి.
Read More: Mahesh Babu: మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సంబంధించి కీలక న్యూస్ అప్ డేట్??
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్లు మొత్తం ఆగిపోయాయి. ఇలాంటి తరుణంలో మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాలంటే చాలా టైం పట్టే అవకాశం ఉండటంతో… “సర్కారు వారి పాట” సినిమా మొత్తం కంప్లీట్ అవ్వాలంటే ఇంకా నాలుగైదు నెలలు టైం పట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. దీంతో ఈ ఏడాది కూడా త్రివిక్రమ్ సినిమా వచ్చే అవకాశం లేనట్లు తాజా పరిస్థితుల బట్టి అర్థమవుతోంది. ఈ పరిణామంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మహేష్ సినిమా ప్రకటించిన గాని త్రివిక్రమ్ కి దురదృష్టం కరోనా రూపంలో వెంటాడుతుంది అంటూ ఆయనపై పంచ్ డైలాగులు వేస్తున్నారు.