ప్రముఖ సింగర్ ర్యాపర్ బాద్ షా తనకు పాపులారిటీ రావటం కోసం యూట్యూబ్ నుంచి వ్యూస్ ను నకిలీ లైక్స్, ఫేక్ వ్యూస్ కొనుగోలు చేసినట్టు ముంబై పోలీసులు గుర్తించారు. గతంలో తన పాటలకు ఒకరోజు 72 మిలియన్లు రావడం వరల్డ్ రికార్డు అని తెగ గొప్పలు చెప్పుకునే బాద్ షా కి గూగుల్ షాకిచ్చి, అయినా చెప్పుకున్న గొప్పల్లో వాస్తవం లేదని కొట్టిపారేసింది. అయితే తన వ్యూస్ పెంచుకోవడం కోసం బాదుషా 72 లక్షలు సోషల్ మీడియాకి ప్రతి ఏడాది చెల్లిస్తున్నట్లు ముంబై పోలీసులు గుర్తించారు.
అయితే వస్తున్న ఆరోపణలపై బాద్ షా స్పందించి తనకు అంత కర్మ పట్టలేదని, ముంబై పోలీసులు జరుపుతున్న విచారణకు పూర్తిగా సహకరిస్తానని బాద్ షా ప్రకటించాడు. మరి వస్తున్నా ఫేక్ వ్యూస్ ప్రచారం పోలీసుల ఆరోపణ ఎంతవరకు నిజం అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉన్నది. ఈ మొత్తం తతంగం అసలు ఎలా బయటపడింది అంటే, బాద్ షా పాపులారిటీ కోసం యూట్యూబ్ నుంచి వ్యూస్ కొనుగోలు చేసినట్టు బాలీవుడ్ సింగర్ భూమి త్రివేది పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటంతో, తాజాగా ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరో పక్క బాద్ షా మాత్రం… వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేస్తున్నారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెటిజన్లు ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు.