Balakrishna-Allu arjun-Nani: నటసింహ నందమూరి బాలకృష్ణ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, న్యాచురల్ నాని.. ముగ్గురు మొత్తానికి తగ్గేదే లే అనిపించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక హీరోయిన్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం.. రెండు భాగాలుగా రాబోతోంది. అయితే మొదటి పార్ట్ పుష్ప ది రైస్ డిసెంబర్ 17న విడుదలై.. నెగటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఈ మూవీ కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది.
నాని విషయానికి వస్తే.. ఈయన నటించిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. ట్యాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. కలకత్తా బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ సినిమా సైతం డిసెంబర్ 24న రిలీజై మంచి విజయం సాధించింది.
ఇక ఈ మూడు చిత్రాలు ఇటీవలె వేరువేరు ఓటీటీల్లో విడుదల అయ్యాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో పుష్ప మొదట అందుబాటులోకి రాగా.. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అఖండ, నెట్ఫ్లిక్స్లో శ్యామ్ సింగరాయ్లు ఒకే రోజు స్ట్రీమింగ్ అయ్యాయి. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ మూడు చిత్రాలు అల్టిమేట్ వ్యూవర్ షిప్ తో ఇప్పటికీ ఆయా ఓటీటీల్లో టాప్ ప్లేస్లోనే ట్రెండ్ అవుతున్నాయి. మొత్తానికి మూడు ఓటీటీల్లోనూ బన్నీ, బాలయ్య, నానిలు కుమ్మేశారని చెప్పాలి.