నటసింహం నందమూరి బాలకృష్ణకు ఈ రోజుతో అరవై యేళ్లు పూర్తయిన సందర్భంగా ఉదయం నుంచి కుటుంబ సభ్యులు..సినీ ప్రముఖులు..రాజకీయ నాయకులు అభిమానులు శుభాకాక్షలు తెలుపుతు ఊపిరాడకుండా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాగే బాలయ్య తన అభిమానుల కోసం ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇక రీసెంట్ గా బోయపాటి శీను తో చేస్తున్న తన తాజా చిత్రానికి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేసి సినిమా ఎలా ఉండబోతుందో సాంపిల్ చూపించారు.
బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా మీద ఈ టీజర్ భారీ అంచనాలను పెంచేసింది. చెప్పాలంటే ఈ మధ్య కాలంలో అటు బాలయ్య కి ఇటు బోయపాటికి సరైన సక్సస్ లేదు. అందుకే ఇద్దరు కలిసి కసితో ఈ సినిమా చేస్తున్నారని అర్థమవుతుంది. ఇక బాలయ్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల పై సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నుంచి నాని లాంటి యంగ్ హీరో వరకు చాలా మంది హీరోలు హీరోయిన్ లు యాడ్స్ లో నటించి ఎన్నో బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాని ఇప్పటి వరకు తన మొత్త కెరీర్ లో ఏ ప్రాడెక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా బాలయ్య ఉండకపోవడం షాకయ్యో విషయం. అయితే ఇది బాలయ్య తండ్రి నందమూరి తారక రామారావు గారి నిర్ణయం అని బాలయ్య తెలిపారు.
ఇక ఇండియా టుడే మ్యాగజైన్ ఒక స్పెషల్ ఎడిషన్ విడుదల చేసిన అతి కొద్ది మంది నటులలో బాలకృష్ణ ఉండటం విశేషం. అలాగే 43వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బాలకృష్ణ గౌరవ అతిథిగా హాజరవడం కూడా ఎంతో గొప్ప విషయం అని చెప్పాలి. అయితే ఇది చాలా మంది తెలుగు నటీ నటులకు లభించని అరుదైన గౌరవం గా బాలయ్య భావిస్తున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!