`సింహా`, `లెజెండ్` చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.ఎన్నికలు తర్వాత సినిమా ప్రారంభమవుతుందని వార్తలు వినిపించినా.. స్క్రిప్ట్ విషయంలో బాలయ్య శాటిస్పాక్షన్ కాలేదు. దాంతో బోయపాటి మళ్లీ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడు. దీంతో సినిమా మరింత ఆలస్యం అవుతుంది. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్ట్లో ప్రారంభిస్తున్నామని బోయపాటి తెలియజేశారు. ఆగస్ట్ రెండో వారంలో సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేలా ప్లాన్స్ జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ నిర్మించే అవకాశాలున్నాయని వార్తలు వినపడుతున్నాయి. ఆగస్ట్లోపు బాలకృష్ణ మరో సినిమాను పూర్తి చేసే ఆలోచనల్లో ఉన్నారని సినీ వర్గాల సమాచారం. త్వరలోనే వాటి వివరాలను ప్రకటిస్తారు.
previous post
next post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!