Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ ఇంకా అల్లు ఫ్యామిలీ మధ్య బాండింగ్ మరింత బలోపేతం అవుతుంది. వాస్తవానికి రెండు కుటుంబాల మధ్య అల్లు రామలింగయ్య ఉన్న సమయంలో చాలా అన్యోన్యంగా ఉండే వాళ్ళని బాలకృష్ణ “అన్ స్టాపబుల్” షో ప్రారంభోత్సవంలో తెలియజేశారు. మా ఇంటిలో వంటగది దాక వెళ్లే ఒకే ఒక వ్యక్తి అల్లు రామలింగయ్య గారు అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆహా ఓటీటీలో “అన్ స్టాపబుల్” ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
మొదటి సీజన్ దేశంలోనే కాదు గ్లోబల్ పరంగా ఓటిటి రంగంలో అత్యధిక స్ట్రీమింగ్ అయిన షోగా నిలిచింది. ఇక సెకండ్ సీజన్ కూడా ఆ దిశగానే కొనసాగుతూ ఉంది. సెకండ్ సీజన్ లో మొదటి ఎపిసోడ్ చంద్రబాబుది అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అల్లు ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ నటించిన కొత్త సినిమా “ఊర్వశివో రాక్షసివో” ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా బాలకృష్ణ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని అల్లూ శిరీష్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
నవంబర్ 4వ తారీఖు ఈ సినిమా విడుదల కానుంది. అక్టోబర్ 30వ తారీకు హైదరాబాద్ JRC కన్వెన్షన్ లో ఈ వేడుక జరగనుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మితమైన ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా చేయడం జరిగింది. గతంలో బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన “లెజెండ్” సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఇప్పుడు అల్లు శిరీష్ సినిమాకి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వస్తూ ఉండటం ఇండస్ట్రీలో సంచలనం రేపింది.