Unstoppable 2: ఓటిటి రంగంలో “అన్ స్టాపబుల్” షో రికార్డుల మోత మోగిస్తోంది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని టాకీ షోలలో ఎక్కువ సమయం స్ట్రీమింగ్ అవుతున్న షోగా సంచలనాలు సృష్టిస్తోంది. మొదటి సీజన్ బాగా ఆకట్టుకోవడంతో రెండో సీజన్ చాలా గ్రాండ్ గా.. ఫస్ట్ సీజన్ కి భిన్నంగా రాజకీయ నాయకులను పలు సెలబ్రిటీలను షో నిర్వాహకులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి ఎపిసోడ్ లో రావడం రాజకీయంగా సంచలనం రేపింది.
“అన్ స్టాపబుల్” షో రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ చంద్రబాబు బాలయ్యది అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రెండో ఎపిసోడ్ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 21వ తారీకు స్ట్రీమింగ్ కానుంది. సెకండ్ ఎపిసోడ్ కి డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డతో పాటు విశ్వక్ సేన్ వచ్చారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఆహా టీం రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రోమోలో డీజే టిల్లుకి జరిగిన పెద్ద అవమానం గురించి ప్రశ్న ఎదురయింది.
దానికి డీజే టిల్లు సమాధానం ఇస్తూ ఈ మచ్చల ముఖంతో హీరో అవ్వాలని అనుకుంటున్నావా అని కెర్రిర్ స్టార్టింగ్ లో చాలా దారుణంగా మాట్లాడారు అంటూ చెప్పడంతో వేదికపై బాలకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. అదే సమయంలో డీజే టిల్లుని హత్తుకున్నారు. దీంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. రేపు ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో మరింత ఇంట్రెస్ట్ నెలకొంది. ఇక ఇదే షో మధ్యలో “బీమ్లా నాయక్” నిర్మాత నాగా వంశీ కూడా జాయిన్ అయ్యారు. అంతేకాకుండా షో మధ్యలో బాలకృష్ణ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఫోన్ లో మాట్లాడటంతో ఈ ఎపిసోడ్ చూడటానికి ఆడియన్స్ మరింత వెయిట్ చేస్తున్నారు.