Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిన్న బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో నిర్వహించారు అక్కడికి బాలయ్య హెలికాప్టర్లో మాస్ ఎంట్రీ ఇచ్చారు శనివారం ఉదయం ఒంగోలు నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు కాకపోతే గాలిలోకి వెళ్లిన హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు దాంతో మళ్లీ ఒంగోలులోనే హెలికాప్టర్ ల్యాండ్ చేశారు..
ప్రస్తుతం బాలకృష్ణ సేఫ్ గా ఉన్నారు. పైలట్ సకాలంలో సమస్యను గుర్తించడంతో అంతా సురక్షితంగా ఉన్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా గాలిలోకి ఎగిరిన హెలికాఫ్టర్ 20 నిమిషాల తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది. టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో ఒంగోలులో పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఉన్న హెలికాఫ్టర్ ల్యాండ్ చేశారు. అందరూ సురక్షితంగా ఉన్నారు. అయితే… ఇప్పుడు మళ్ళీ హెలికాఫ్టర్ ప్రయాణం చేయడం మంచిదేనా .. లేదంటే రోడ్డు మార్గంగా బాలకృష్ణ హైదరాబాద్ చేరుకుంటే మంచిదా అనేది ఇప్పుడు అందరి ప్రశ్న.. బాలకృష్ణ కు ప్రమాదం తప్పిపోయిందనే తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!