ఎన్టీఆర్ బయోపిక్ `యన్.టి.ఆర్` రెండు భాగాలు `కథానాయకుడు`, `మహానాయకుడు` డిజాస్టర్ కావడంతో బాలయ్య నెక్ట్స్ సినిమాపై అచి తూచి ముందుకెళుతున్నాడట. సినిమా బడ్జెట్ విషయంలో దర్శకుడు బోయపాటికి పరిమితి విధించాడు. మరో వైపు వినయవిధేయరామ ప్లాప్ కూడా బోయపాటి పరిస్థితిపై మరింత ఎఫెక్ట్ పడింది. అయితే ఈ సినిమాను ఎన్నికల ముందుగానే సెట్స్లోకి తీసుకెళ్లాలా? లేక తర్వాతనా? అని బాలయ్య మల్లగుల్లాలు పడ్డాడు. అయితే సినిమాకు మధ్య బ్రేక్ ఇవ్వడం బాలయ్యకు ఇష్టం లేకపోవడంతో ఏకంగా బోయపాటితో సినిమాను ఎన్నికలు తర్వాతే సినిమాను సెట్స్ కు తీసుకెళతామని నిర్ణయం తీసుకుని .. బోయపాటికి క్లారిటీ ఇచ్చేశాడు. సినిమా చేస్తున్న మధ్యలో గ్యాప్ తీసుకుంటే స్పీడు తగ్గిపోయి డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని బాలయ్య భావన. ఈ అభిప్రాయాన్ని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు కూడా. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నాడు బోయపాటి. `సింహా`, `లెజెండ్` తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రాబోయే సినిమా ఇది.
previous post
next post