Balakrishna: నందమూరి తారక రత్న ఇటీవల గుండెపోటుకు గురికావడం తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర ప్రారంభం రోజే తారకరత్నకి గుండెపోటు రావడం పార్టీ కేడర్ మరియు నందమూరి కుటుంబ సభ్యులలో నిరుత్సాహం నింపింది. దాదాపు మూడు వారాలకు పైగా చికిత్స తీసుకుంటున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి చాలా విషమీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో విదేశీ వైద్యుల చేత చికిత్స ఇప్పించడానికి నందమూరి కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే తారకరత్న కోసం నందమూరి బాలయ్య బాబు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందట.
విషయంలోకి వెళ్తే తారకరత్న చికిత్స తీసుకున్నంతకాలం అతని దగ్గరే ఉండాలని బాలకృష్ణ డిసైడ్ అయ్యారట. జనవరి 27వ తారీకు గుండెపోటుకు గురైన తారకరత్న ప్రస్తుతం బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. అప్పటినుండి తారకరత్న దగ్గరే బాలయ్య ఉంటూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం మరింత కఠినంగా పరిస్థితి మారినట్లు దీంతో దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ కి బాలయ్య బ్రేక్ చెప్పడం జరిగిందంట. మరో పక్క తారకరత్న ఆరోగ్యం బాగుపడాలని మృత్యుంజయ స్వామి ఆలయంలో అఖండ జ్యోతి కార్యక్రమం బాలకృష్ణ చేపట్టడం జరిగింది.
ఏది ఏమైనా తారకరత్న అని బతికించుకుని బయటకు తీసుకురావాలని ఫుల్లుగా డిసైడ్ అయ్యారట. ఇటీవలే బాలకృష్ణ సంక్రాంతి పండుగకు “వీరసింహారెడ్డి” సినిమాతో అదిరిపోయే విజయాన్ని అందుకోవడం జరిగింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరియర్ లో రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబడింది. రాయలసీమ ఫ్యాక్షన్ సబ్జెక్టుతో వచ్చిన ఈ సినిమా మరోసారి బాలయ్య తన నటనతో విశ్వరూపం చూపించారు. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో తెలంగాణ స్లాంగ్ తో.. బాలయ్య పాత్ర ఉండనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావలసి ఉండగా తారకరత్న అనారోగ్యం కారణంగా బాలయ్య… బ్రేక్ ఇవ్వడం జరిగింది.