Balakrishna: ఇన్నాళ్లు హీరోగానే ప్రేక్షకులను అలరించిన నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఇటీవల హోస్ట్గా మారి అందరికీ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఈయన తొలిసారి వ్యాఖ్యాతగా చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారం అవుతున్న ఈ టాక్ షోలో బాలయ్య తనదైన హోస్టింగ్తో అదరగొట్టేసి ట్రోలర్ల నోర్లు మూయించాడు.
ప్రస్తుతం ఉన్న టాక్ షోస్ అన్నిటినీ బీట్ చేసి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న ఆన్ స్టాపబుల్ గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవిదేశాల్లోనూ చర్చించుకుంటున్నారు. అంతలా బాలయ్య అన్ స్టాపబుల్ను సక్సెస్ చేశారు. ఇకపోతే త్వరలోనే ఫస్ట్ సీజన్ ముగిసిపోతున్న తరుణంలో.. ఈ షోకు బాలయ్య అందుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాలు ప్రకారం.. అన్ స్టాపబుల్ కి బాలయ్య అక్షరాల రూ. 5 కోట్లను పారితోషకంగా పుచ్చుకున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలీదు గానీ.. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫిగర్ను విని అందరికీ బైర్లు కమ్మేస్తున్నాయి. ఎందుకంటే, ఒక టాక్ షోకు ఐదు కోట్ల రూపాయిల రెమ్యునరేషన్ అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.
కాగా, బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల `అఖండ`తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్లో ఉన్న ఆయన ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తన 107వ చిత్రాన్ని ప్రారంభించారు. శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది.