నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుండి ప్రారంభం కానుంది. `జైసింహా` తర్వాత సి.కల్యాణ్ నిర్మాతగా, కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా రూపొందుతున్న చిత్రమిది. శ్రియా శరన్ హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. ఈ చిత్రానికి రూలర్, క్రాంతి అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ చిత్రంలో బాలయ్య పోలీస్ ఆఫీసర్గా, గ్యాంగ్స్టర్గా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారట. తొలి షెడ్యూల్ హైదరాబాద్లో కాకుండా బీహార్లో చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్లో ఫైట్స్తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేసేలా ప్లాన్స్ జరుగుతున్నాయి.
previous post
next post