Veera Simha Reddy: నటసింహం నందమూరి బాలయ్య బాబు నటించిన “వీరసింహారెడ్డి” గురువారం విడుదలయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం తెలిసిందే. సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు. 2021లో “అఖండ” చేశాక గత ఏడాది బాలయ్య నుండి ఒక సినిమా రాలేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే “వీరసింహారెడ్డి” తో మరో బ్లాక్ బస్టర్ సంక్రాంతి సీజన్ లో అందుకోవటం సంచలనం సృష్టించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ సీనియర్ బాలకృష్ణ పాత్ర అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
సినిమాలో డైలాగులు, ఫైట్స్ అన్ని రకాలుగా అలరించడంతో.. సక్సెస్ కావటంతో గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో సినిమా యూనిట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో హీరో బాలకృష్ణ, వరలక్ష్మి శరత్ కుమార్, తమన్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని మరియు నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… “అఖండ” వంటి భారీ విజయం సాధించిన తర్వాత దానికి తీటుగానే సినిమా చేయాలని “వీరసింహారెడ్డి” కథ ఒప్పుకోవడం జరిగింది. పైగా చాలా రోజుల తర్వాత ఫ్యాక్షన్ సినిమా చేయాలని ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది.
ఈ క్రమంలో సాయి బుర్ర మాధవ్ అద్భుతమైన డైలాగులు రాయటం సినిమాకి ఎంతో కలిసి వచ్చింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బాణీలు థియేటర్ లో సినిమాకి మరో ప్రాణం పోసినట్లు అయింది. ఇందుకుగాను తమన్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక పోరాట సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ అద్భుతంగా కంపోజ్ చేశారు. ఇంక నా చెల్లెలి పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్.. అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేయడం జరిగింది. ఇంకా శృతిహాసన్, దునియా విజయ్ తమ పాత్రలకు ఎంతో న్యాయం చేశారు. ఫ్యాక్షన్ డ్రాప్ లో వచ్చినా గాని అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని అద్భుతంగా సినిమాలో చూపించారు. ప్రేక్షకుల ప్రోత్సాహంతో మరిన్ని మంచి సినిమాలు రాబోయే రోజుల్లో చేస్తామని పేర్కొన్నారు. “వీరసింహారెడ్డి”ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బాలకృష్ణ తన స్పీచ్ ముగించారు.