Balakrishna: నటుడిగా ఎన్నో మైలు రాళ్లను అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు నిర్మాతగా మారాడు. తాజాగా `బసవ తారకరామ క్రియేషన్స్` పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఎన్టఆర్ శతజయంతిని పుష్కరించుకుని మే 28న బాలయ్య తన బ్యానర్లో నిర్మించబోయే తొలి ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించబోతున్నారు.
దీంతో బాలయ్య నిర్ణాణంలో నటించే మొదటి అవకాశం ఏ హీరోకు వస్తుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ ఇంట్రస్టింగ్ టాక్ బయటకు వచ్చింది. అదేంటంటే.. బసవ తారకరామ క్రియేషన్స్ బ్యానర్లో మొదట బాలయ్య తనయుడు మోక్షజ్ఙ డబ్యూనే నిర్మితం కానుందట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మోక్షజ్ఙ డబ్యూ మూవీకి సంబంధించిన వివరాలనే మే 28న అధికారికంగా అనౌన్స్ చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే.. మరో రెండు రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా, బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నాడు.
`ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ దసరా కానుకగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది పూర్తైన వెంటనే బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఈ సినిమా చేయనున్నాడు.