Krishnam Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. కృష్ణంరాజు మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు స్టార్ హీరోలు ఇంకా పలువురు రాజకీయ నాయకులు ప్రధాని మోడీ సహా సంతాపం వ్యక్తం చేశారు. చిరంజీవి, మోహన్ బాబు, ఎన్టీఆర్, నాని, పవన్ కళ్యాణ్ ఇంకా మహేష్ బాబు చాలామంది స్టార్ హీరోలు కృష్ణంరాజు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ “NBK 107” అనే వర్కింగ్ టైటిల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం టర్కీలో జరుగుతుంది. ఈ క్రమంలో కృష్ణంరాజు మరణ వార్త తెలుసుకున్న బాలకృష్ణ “NBK 107” షూటింగ్ సెట్స్ లో చిత్ర బృందంతో కలిసి సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రభాస్ తో పాటు కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు బాలయ్య సానుభూతిని తెలపడం జరిగింది. బాలకృష్ణ ఇంకా కృష్ణంరాజు నటించిన సినిమాలు రెండు. 1999 వ సంవత్సరంలో “సుల్తాన్” ఇంకా ఆ తర్వాత 2000 సంవత్సరంలో “వంశోద్ధారకుడు” ఈ రెండు సినిమాలలో కృష్ణంరాజు బాలయ్య కలిసి నటించడం జరిగింది.
మొన్ననే బాలకృష్ణ “NBK 107” షూటింగ్ కి సంబంధించి కర్నూలులో భారీ షెడ్యూల్ లో పాల్గొన్నారు. సినిమాకి సంబంధించి కొన్ని బాధాకరమైన సన్నివేశాలతో పాటు.. పాటలు కూడా చిత్రీకరించడం జరిగింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లేదా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. బాలకృష్ణ కి జోడిగా శృతిహాసన్ నటిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. వరుస విజయాల మీద ఉన్న గోపీచంద్ మలినేని.. డైరెక్టర్ కావడంతో “NBK 107” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.