Kangana Ranaut: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 షోలో జయసుధ, జయప్రద పాల్గొన్నారు. ఈ షో లో వీళ్లతో పాటు యంగ్ బ్యూటీ రాశి ఖన్నా కూడా పాల్గొంది.. అయితే జయసుధ కంగనా రనౌత్ కి పద్మశ్రీ అవార్డు అందుకోవడం పై సంచల వ్యాఖ్యలు చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి..
హీరోయిన్ గా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ ఉంది. నటిగా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకుంది. విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతున్న కంగనా రనౌత్ వరుసగా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వివాదాల్లో నిలుస్తూనే ఉంది. కానీ కంగనా విభిన్నమైన వ్యక్తిత్వం, నటన ప్రతిభకి భారత ప్రభుత్వం ఆమెని పద్మశ్రీ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే.. కంగనాకి పద్మశ్రీ ఇవ్వడంపై అనేక కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ కూడా చేరారు.
అన్ స్టాపబుల్ సీజన్ 2 షోకి వచ్చిన జయసుధ బాలకృష్ణ తో పలు ఆసక్తికర విషయాలు గురించి మాట్లాడగా.. సౌత్ నటీనటులని భారత ప్రభుత్వం సరిగ్గా గుర్తించడం లేదు అని జయసుధ విమర్శించారు. అందుకు ఉదాహరణగా కంగనా రనౌత్ ని పేర్కొన్నారు. కంగనా రనౌత్ పట్టుమని పది చిత్రాల్లో కూడా నటించలేదు. కానీ తనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. అయితే సౌత్ లో నా లాంటి సీనియర్స్ కి ఆ గౌరవం దక్కడం లేదు. దశాబ్దాలుగా నటనలో రాణిస్తున్నాం. మమ్మల్ని ప్రభుత్వం ఏ రకంగానూ గుర్తించడం లేదు.. విజయ నిర్మలగారు దర్శకురాలిగా గిన్నిస్ రికార్డ్ సాధించారు. కానీ ఆమెకి కూడా పద్మశ్రీ దక్కలేదు అని జయసుధ అన్నారు. జయసుధ కామెంట్స్ కి జయప్రద మద్దతు తెలిపారు. ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలని తాను చాలా సార్లు పార్లమెంట్ లో పోరాడినట్లు జయప్రద పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.