Veerasimhareddy: నట సింహం నందమూరి బాలయ్య బాబు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో “వీరసింహారెడ్డి” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుసపరాజయాలలో ఉన్న బాలయ్య బాబు గత ఏడాది లెజెండ్ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటం జరిగింది. ఇండస్ట్రీలో ఒక్క పరాజయం లేని దర్శకుడిగా ఉన్న గోపీచంద్ మలినేని…తో బాలయ్య బాబు చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే సినిమాకి సంబంధించి విడుదలైన వీడియో మరియు పోస్టర్ లు సినిమాపై ఉన్న కొద్ది అంచనాలు పెంచేస్తున్నాయి.
ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. సమరసింహారెడ్డి ఇంకా పోలు సినిమాలకు 200.. రెట్లు ఉంటుందని గోపీచంద్ మలినేని టైటిల్ లోగో లాంచ్ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. బాలకృష్ణ అభిమానిగా… ఆయనను.. అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో.. ఆ రీతిగా సినిమాలో చూపించినట్లు తెలిపారు. ఇదంతా పక్కన పెడితే “వీర సింహారెడ్డి” సినిమాలో హైలెట్ సీన్ ఇదే అని ఒక వార్త బయటకు వచ్చింది. సరిగ్గా ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంటుందట. ఈ సన్నివేశం దగ్గరే బాలయ్య మరియు శృతిహాసన్ పాత్రల ట్విస్ట్ రివిల్ అవుతుందని… సినిమా మొత్తానికి ఈ ట్విస్ట్ హైలెట్ అవుతుందని ప్రచారం జరుగుతుంది.
చాలా ఎమోషనల్ గా సన్నివేశాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తీర్చిదిద్దినట్లు.. సినిమా చూసే ప్రేక్షకుడు రోమాలు నీక్కబడుచుకునేలా… చిత్రీకరించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ డబల్ క్యారెక్టర్ చేసినట్లు టాక్. తమన్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకి హైలైట్ గా ఉండనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.