Veera Simha Reddy: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన “వీరసింహారెడ్డి” సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కావడం తెలిసిందే. బాలయ్య కెరియర్ లో రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టడం జరిగింది. ఈ క్రమంలో సినిమా విజయోత్సవ వేడుక ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా యూనిట్ తోపాటు ప్రస్తుతం బాలకృష్ణ తో సినిమా చేస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంకా హరీష్ శంకర్ వంటి వారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పోటీ ఉండాలని అన్నారు. అదేవిధంగా ఏ విషయం అయినా నిజాయితీగా ఇంక ధైర్యంగా చెప్పటం అనేది ఒక గర్జనలా ఉండాలి. అలా ఉండాలంటే నాలా సింహంలా పుట్టాలి.
ఉదయం లేచిన వెంటనే తన తండ్రి మాదిరిగానే చుట్ట తాగటం తనకి అలవాటని తెలియజేయడం జరిగింది. అది నా ఆరోగ్యం కోసం.. డైలాగ్ డెలివరీ ఇంకా.. ఫైట్లు పాటలు కోసం..మీ అందరి అభిమానం పొందటం కోసం అని తెలియజేశారు. ఉదయం తన దినచర్య చుట్టతోనే స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా రామ జోగయ్య శాస్త్రి, సాయి బుర్ర మాధవ్ అద్భుతంగా పనిచేయడం జరిగింది. సినిమాలో డైలాగులు మంచి నాటు రీతిలో థియేటర్లో అద్భుతంగా పలికాయి. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేయడం నా అదృష్టం. 24 గంటలు సినిమా.. హాస్పిటల్ మరియు నియోజకవర్గ ఈ మూడు గురుంచి ఆలోచన… తన ఆరోగ్యానికి సీక్రెట్ అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఎదురులేని బెదిరిలేని వీరసింహారెడ్డిని నేనే. చాలాకాలం తర్వాత నేను నటించిన ఫ్యాక్షన్ సినిమా ఇది. నా మేనరిజం నుండే ఒక్కోసారి కథలు పుడుతూ ఉంటాయి.
ఇలాంటి విషయాల్లో బోయపాటి సమర్ధుడు. అయితే ఈసారి నా మేనరిజం నుండి గోపీచంద్ మలినేని కథ రాయడం జరిగింది. అటువంటి ఈ రాయలసీమ కథను వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ భాషలకు చెందినవారు ఆదరించడం నిజంగా సంతోషించదగ్గ విషయం. సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ మరియు దునియా విజయ్… చాలా ప్రధానం. ఇంకా తమన్ అందించిన పాటలు.. సంగీతం సినిమాకి ఎంతగానో ప్రాణం పోశాయి. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళకు నిజంగా ధన్యవాదాలు అంటూ బాలకృష్ణ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!