బండ్ల గణేష్: మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం చాలా నష్టపోవటం జరిగింది. అందులోనూ సినిమా ధియేటర్ల వ్యాపారం గత రెండు సంవత్సరాల నుండి తీవ్ర నష్టాలలో రన్ అవుతుంది. వైరస్ కారణంగా థియేటర్లకు వెళ్లడానికి జనాలలో భయం రావడంతో పాటు మరోపక్క టికెట్ రేట్లు ఆకాశాన్ని అంటుతూ ఉండటంతో.. అంతగా ఇష్టపడలేకపోతున్నా పరిస్థితి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇదే సమయంలో ఓటిటి కి భారీ డిమాండ్ ఏర్పడటంతో జనాలు థియేటర్లకు రావడంలేదని ఇండస్ట్రీలోనే కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ కమెడియన్ మరియు నిర్మాత పరమేశ్వర ఆర్ట్స్ అధినేత బండ్ల గణేష్ తాజా పరిణామం పై రియాక్ట్ అయ్యారు. ఓటీటీలకు అలవాటు పడి థియేటర్ లకు ఆడియన్స్ రావటం లేదన్న వాదనపై స్పందించారు. “మంచి కథనంతో అద్భుతంగా సినిమాలు తీస్తే కచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు.
వేల కోట్ల రూపాయలతో సినిమాలు తీసి.. వంద కారులను ఎగరేసి, హీరో చేతిలో రాడ్డు పట్టుకుని వందమందిని కొడితే జనాలు వస్తారని అనుకోవటం తప్పు. గుండెకు హత్తుకునే సినిమాలు తీసినంత కాలం మనకి అపజయం లేదు అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. దీంతో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా సినిమాలు రిలీజ్ అయిన కొద్ది వారాలకి ఓటీటీ లోకి ప్రత్యక్షం కావడంతో జనాలు పెద్దగా థియేటర్ల వైపు మొగ్గు చూపటం లేదన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. దీంతో హై బడ్జెట్, లో బడ్జెట్ సినిమాలకు సంబంధించి ఓటీటి రిలీజ్ విషయంలో ఫిలిం ఛాంబర్ సభ్యులు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా ప్రస్తుతం ఇండస్ట్రీలో జనాలు ఇదివరకు మాదిరిగా థియేటర్ లకి రావటం లేదన్న టాక్ గట్టిగా నడుస్తుంది.