Bangarraju Movie: కింగ్ నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య కలిసి నటించిన తాజా చిత్రం `బంగార్రాజు`. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ మూవీలో కృతి శెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. 2016లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన `సోగ్గాడే చిన్నినాయన`కు సీక్వెల్గా రూపొందిన ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున స్వయంగా నిర్మించారు.
శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ జనవరి 14న రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. కరోనా ఇబ్బందులున్నా, ఏపీలో టికెట్ రేట్ల విషయంలో క్లారిటీ రాకపోయినా వెనుకంజవేయకుండా మేకర్స్ ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపారు. ఫలితంగా సంక్రాంతి పండక్కి పర్ఫెక్ట్ సినిమాగా అందరి చేత మంచి మార్కులు వేయించుకుని బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లను రాబట్టింది.
ఇకపోతే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేయబోతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. అయితేఈ నెల 18న బంగార్రాజు చిత్రం జీ 5లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. దీనిపై తాజాగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో బంగార్రాజు చిత్రాన్ని మరోసారి చూసి ఎంజాయ్ చేసేందుకు అక్కినేని అభిమానులు ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నారు.