ఎలాంటి పాత్రనైనా తన నటనతో మెప్పించగల సత్తా ఉన్న నటుడు కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ నట వారసుడు ధృవ్ నటించిన ‘వర్మ’ విడుదలని ఆపేశారు. కోలీవుడ్లో వర్గాలకే షాక్ ఇచ్చిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయ్యింది. అర్జున్ రెడ్డి సినిమాకి, బాల తీసిన వర్మకి చాలా తేడా ఉండడం, తెలుగు సినిమాలోని ఆత్మని పట్టుకోవడంలో బాలా పూర్తిగా విఫలమయ్యాడని, ఫైనల్ వెర్షన్ చూశాక సంతృప్తిగా లేకపోవడంతోనే వర్మ సినిమాని ఆపేస్తున్నామని చిత్ర నిర్మాతలు తెలిపారు. ధృవ్ ని తప్ప మిగిలిన చిత్ర యూనిట్ మొత్తాన్ని తప్పించిన నిర్మాతలు, తాజాగా ‘వర్మ’ చిత్రం కోసం బాలీవుడ్ నటి బనిత సంధును ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ‘అక్టోబర్’ అనే హిందీ సినిమాతో అలరించిన బనిత సంధు తమిళంలో వర్మ కోసం ఎంపిక అయినట్లుగా బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించాడు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రం డైరెక్షన్ టీంలో సందీప్ వంగకు అసోసియేట్ గా వర్క్ చేసిన గిరీశయ్య ఈ రీమేక్ కు డైరెక్టర్ గా వర్క్ చేయబోతున్నాడు.
previous post
next post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!