Rajanikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం చేస్తారని 2020 వ సంవత్సరంలో అందరూ భావించగా చివరి నిమిషంలో పొలిటికల్ ఎంట్రీ నిర్ణయం నుండి రజిని వెనక్కి తగ్గటం తెలిసిందే. అప్పటికే జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం గ్యారెంటీ అని రజనీ అభిమానులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో రజినీకాంత్ అనారోగ్యానికి గురికావటంతో.. ఇది భగవంతుడు నిర్ణయం కాదని అభిమానులు క్షమించాలని రజిని మూడు పేజీల లెటర్ రాయటం జరిగింది.
ఇక ఇదే సమయంలో రజినీకాంత్ సినిమాలు కూడా చేసే అవకాశం లేదని వార్తలు వచ్చాయి. కానీ రజిని “అన్నతై” తర్వాత రెండు సినిమాలను రజిని లైన్ లో పెట్టడం తెలిసిందే. దీనిలో ఒకటి బీస్ట్ వంటి డిజాస్టర్ సినిమా తీసిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ప్రాజెక్ట్. దీంతో ఇప్పుడు రజనీ అభిమానులు ఫుల్ టెన్షన్ పడుతున్నట్లు తమిళ ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన “బీస్ట్” అట్టర్ ప్లాప్ కావటంతో.. రజిని ప్రాజెక్ట్ ఏమవుతుందో అన్నా భయాందోళనలో రజినీ ఫ్యాన్స్ ఉన్నారట.పైగా కాపీ పేస్ట్ అనే ముద్ర నెల్సన్ పై పడటంతో మరి టెన్షన్ పడుతున్నారు అంట. మరో ప్రాజెక్ట్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో కన అనే సినిమాని తెరకెక్కించిన అరుణ్ రాజా కామరాజ్ దర్శకత్వంలో కూడా రజిని సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. “బీస్ట్” సినిమా రిలీజ్ అవ్వకుండానే నెల్సన్ మూవీని రజిని ఓకే చేయడం జరిగింది. ఈ సినిమాకి అనిరుద్ధ్ సంగీతం వహిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. “బీస్ట్” దెబ్బతో… రజిని ఫ్యాన్స్ ఇప్పుడు వణికి పోతున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!