2014లో హీరోగా అల్లుడు శీనుతో రంగ ప్రవేశం చేశాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. రీసెంట్గా `రాక్షసుడు` చిత్రంతో మంచి సక్సెస్ను సొంతం చేసుకున్నాడీ కుర్ర హీరో. సక్సెస్ గురించి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బెల్లంకొండ శ్రీనివాస్శ్తో పాటు ఆయన తండ్రి బెల్లం సురేశ్ పాల్గొన్నారు. రూ.22కోట్ల వ్యయంతో రూపొందిన `రాక్షసుడు` చిత్రం 10 రోజులకంతా బ్రేక్ ఈవెన్ సాధించిందని తెలిపారు. ఈ సందర్భంలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి గురించి విలేఖరులు ప్రశ్నించగా.. శ్రీనివాస్కి సంబంధాలు చూస్తున్నామని, ఇండస్ట్రీకి సంబంధం లేని కుటుంబం నుండే సంబంధాలు వెతుకుతున్నామని, మంచి సంబంధం కుదిరితే పెళ్లి చేసేస్తామని ప్రకటించారు.
previous post
next post