Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ బ్యాక్డ్రాప్లో వింటేజ్ ప్రేమ కథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కృష్టం రాజు, సత్యరాజ్, భాగ్యశ్రీ కీలక పాత్రలను పోషించారు.
ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాధేశ్యామ్లో ప్రభాస్ తల్లి పాత్ర పోషించిన సీనియర్ నటి భాగ్యశ్రీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. అలాగే ప్రభాస్పై ఆసక్తికర కామెంట్స్ కూడా చేశారు. `రాధేశ్యామ్లో ప్రభాస్కు తల్లిగా నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన చాలా గొప్ప నటుడు. సెట్స్లోనే ఆయనను తొలిసారి చూశాను.
ఎలా పలకరించాలా అని అనుకుంటుండగా ప్రభాస్ స్వయంగా నా దగ్గరికి వచ్చి నేను మీ అభిమానిని అంటూ చెప్పాడు. ప్రభాస్ ఆ మాటనగానే నేను షాక్ అయ్యాను. ఇక ఆయన అంత సింపుల్గా ఉంటారని, అంత చనువుగా మాట్లాడతారని ఊహించలేదు` అంటూ భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఈమె కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!